వ్యాపారవేత్త శిల్ప అరెస్ట్.. ప్రముఖులకు కుచ్చుటోపీ..!
పోలీసులు శిల్ప, శ్రీనివాస్లను ప్రశ్నించి వారి యొక్క బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. దివ్య వద్ద రూ.కోటీ కి పైగా నగదు తీసుకున్నట్టు పోలీసులు నిర్థారించారు. అయితే డబ్బులను తిరిగి చెల్లించకపోవడంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ముఖ్యంగా చాలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన శిల్పాచౌదరి వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని పలువురిని కోట్లలో మోసం చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. అదేవిధంగా పలువురు సెలబ్రీటీలకు పార్టీలు ఇచ్చి మరీ శిల్ప ఆకర్షించినట్టు తెలుస్తున్నది.