వ్యాపార‌వేత్త శిల్ప అరెస్ట్‌.. ప్ర‌ముఖుల‌కు కుచ్చుటోపీ..!

N ANJANEYULU
వ్యాపారంలో జ‌స్ట్ పెట్టుబ‌డి పెడితే అధిక లాభాలు క‌ల్పిస్తామ‌ని మోసం చేసిన వ్యాపార‌వేత్త శిల్పచౌద‌రి అనే మ‌హిళతో పాటు ఆమె భ‌ర్త శ్రీ‌నివాస్‌ను కూడా ఇవాళ నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసారు. త‌న వ‌ద్ద నుంచి రూ.కోటి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుని తిరిగి ఇవ్వ‌లేద‌ని దివ్య అనే మ‌హిళ నార్సింగ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని.. ద‌ర్యాప్తు చేప‌ట్ట‌డం మొద‌లు పెట్టి గండిపేట సిగ్నేచ‌ర్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప దంప‌తుల‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు శిల్ప‌, శ్రీ‌నివాస్‌ల‌ను ప్ర‌శ్నించి వారి యొక్క బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలించారు. దివ్య వ‌ద్ద రూ.కోటీ కి పైగా న‌గ‌దు తీసుకున్న‌ట్టు పోలీసులు నిర్థారించారు. అయితే డ‌బ్బుల‌ను తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో శిల్ప‌, ఆమె భ‌ర్త శ్రీ‌నివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు పోలీసులు. ముఖ్యంగా చాలా విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డిన శిల్పాచౌద‌రి వ్యాపార‌వేత్త‌గా ప‌రిచ‌యం చేసుకుని ప‌లువురిని కోట్ల‌లో మోసం చేసిన‌ట్టు పోలీసులు ధృవీక‌రించారు. అదేవిధంగా ప‌లువురు సెల‌బ్రీటీల‌కు పార్టీలు ఇచ్చి మ‌రీ శిల్ప ఆక‌ర్షించిన‌ట్టు తెలుస్తున్న‌ది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: