జనాలను తాగుబోతులను చేయడమా?: షర్మిల కామెంట్స్

తెలంగాణాలో వైఎస్ షర్మిల రాజకీయంగా ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా తెలంగాణాలో కాస్త గట్టిగా కష్టపడుతున్న వైఎస్ షర్మిల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సిఎం సారుకు లిక్కర్ అమ్మకాల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేదు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.
 బార్లకు టెండర్లు పిలవడంలో ఉన్న సోయి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో లేదు అని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇంకెంతమంది నిరుద్యోగులు బలికావాలి?  అని ఆమె ప్రశ్నించారు.  బంగారు తెలంగాణ అంటే నిరుద్యోగులను బలిపీఠం ఎక్కించడమా?  అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. జనాలను తాగుబోతులను చేయడమా? అని నిలదీశారు. రాజకీయంగా ఇప్పుడు షర్మిల కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: