జనాలను తాగుబోతులను చేయడమా?: షర్మిల కామెంట్స్
బార్లకు టెండర్లు పిలవడంలో ఉన్న సోయి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో లేదు అని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇంకెంతమంది నిరుద్యోగులు బలికావాలి? అని ఆమె ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే నిరుద్యోగులను బలిపీఠం ఎక్కించడమా? అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. జనాలను తాగుబోతులను చేయడమా? అని నిలదీశారు. రాజకీయంగా ఇప్పుడు షర్మిల కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ అవుతున్నాయి.