చంద్రబాబుకు అమిత్ షా నుండి ఫోన్... ఏమన్నారంటే..?

టిడిపి అధినేత చంద్రబాబుతో కొద్ది సేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ నుంచి నిన్న రావడం... ఆ తరువాత ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని అమిత్ షా బాబుకు వివరించారు. అయితే తాను హైదరాబాద్ వచ్చేశానని చంద్రబాబు అమిత్ శా కు చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి, గంజాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసం లాంటి అంశాలను చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. 


రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చంద్రబాబు షా కు వివరించారు. టిడిపి నేతలపై కేసులు.... గృహాలపై దాడులు విధ్వంసాల పై చర్యలు తీసుకోవాలని  చంద్రబాబు అమిత్ షా ను కోరారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని చంద్రబాబు అమిత్ షా ను కోరినట్టు సమాచారం. కాగా అన్ని విషయాలను పరిశీలిస్తానని హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: