అత్తాపూర్‌లో తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం

N ANJANEYULU
హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ మ‌ధ్య కాలంలో త‌రుచూ అదృశ్యాలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇటీవ‌ల రాజేంద్ర‌న‌గ‌ర్ హైద‌ర్‌గూడ‌లో బాలుడు అనీష్‌కుమార్ అదృశ్య‌మై మృతి చెందిన విష‌యం విధిత‌మే. అయితే  అనీష్ మృతిపై కుటుంబ స‌భ్యులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ముమ్మాటికీ హ‌త్య‌నే అని..  ఎవ‌రో హ‌త్య‌నే చేశారని, క‌న్నుగుడ్డు తీవ్రంగా గాయ‌ప‌రిచార‌ని పేర్కొంటున్నారు.
ఇది ఉండ‌గానే తాజాగా అత్తాపూర్ ఎం ఎం ప‌హాడీలో ఓ త‌ల్లితో పాటు ఇద్ద‌రు కూతుర్లు కూడ అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త‌ల్లి అమ్రిన్, కూతుర్లు అక్సాబేగం, అజాబేగం లు ఇంటినుంచి బ‌య‌టికి వెళ్లారు. బ‌య‌టికి వెళ్లిన వారు తిరిగి వ‌స్తార‌ని ఎదురు చూసిన భ‌ర్త   రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల‌ను, బందువుల‌ను ఆరాతీశాడు. చుట్టు ప‌క్క‌ల గాలించిన  భ‌ర్త అభ‌రార్ ఎక్క‌డ వారి ఆచూకి క‌నిపించ‌కపోవ‌డంతో అత్తాపూర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. భార్య‌, పిల్ల‌లు అదృశ్యం అయ్యార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్య‌ప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: