అత్తాపూర్లో తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం
ఇది ఉండగానే తాజాగా అత్తాపూర్ ఎం ఎం పహాడీలో ఓ తల్లితో పాటు ఇద్దరు కూతుర్లు కూడ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తల్లి అమ్రిన్, కూతుర్లు అక్సాబేగం, అజాబేగం లు ఇంటినుంచి బయటికి వెళ్లారు. బయటికి వెళ్లిన వారు తిరిగి వస్తారని ఎదురు చూసిన భర్త రాకపోవడంతో కుటుంబ సభ్యులను, బందువులను ఆరాతీశాడు. చుట్టు పక్కల గాలించిన భర్త అభరార్ ఎక్కడ వారి ఆచూకి కనిపించకపోవడంతో అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. భార్య, పిల్లలు అదృశ్యం అయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.