రాజకీయం చేయడానికి సిద్ధం: పరిటాల శ్రీరామ్‌

N.Hari
తాము ఇన్ని రోజులు రాజకీయం వద్దని అనుకున్నామనీ, ఇప్పుడు రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నామనీ తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్‌ అన్నారు. అభివృద్ధికి తామెప్పుడూ వ్యతిరేకం కాదనీ, అరాచకాలకు మాత్రమే వ్యతిరేకమనీ శ్రీరామ్‌ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో కూరగాయల మార్కెట్‌ను పరిటాల శ్రీరామ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై శ్రీరామ్‌ మండిపడ్డారు. మార్కెట్‌ సమస్యలు మార్కెట్‌లో కాకుండా ఎమ్మెల్యే ఇంట్లో పరిష్కరిస్తున్నారా? ఆయన ప్రశ్నించారు. అధికారులను ఎమ్మెల్యే బంట్రోతుల్లా భావిస్తున్నారనీ, ఇక్కడ అధికారులు ఎమ్మెల్యే కంట్రోల్‌లో పని చేస్తున్నారనీ ఆరోపించారు. పొద్దున "గుడ్‌ మార్నింగ్‌" కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తానంటున్నారనీ, మిగిలిపోయిన కూరగాయలు ఎత్తుకుపోయేకి వస్తున్నారా? అని శ్రీరామ్‌ ఎద్దేవా చేశారు. మార్కెట్లో నష్టపోయిన బాధితులకు రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని పరిటాల శ్రీరామ్‌ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: