టీఆర్ఎస్ తట్టబుట్ట సర్దుకోవడం ఖాయం : బాబు మోహన్
హుజూరాబాద్లో వేటకుక్కల్లా, తోడేళ్లలా మీ ఎమ్మెల్యేలను ఎందుకు తిప్పుతున్నావు కేసీఆర్ అని ప్రశ్నించారు బాబు మోహన్. ఈటల ఒక్కడు గెలిస్తే ఏమవుతుంది అని అన్నవారు ఇప్పుడు ఈ జనాన్ని చూసి టీఆర్ఎస్ తట్టబుట్ట సర్ధుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఈటలకు హుజూరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. బడుగుల ప్రతినిధిగా ఆయనకు ఎంతో గుర్తింపు ఉందన్నారు.
కట్టు కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని పేర్కొన్నారు. హుజూరాబాద్లో అభివృద్ధి జరగాలంటే ఈటల రాజేందర్ను గెలిపించాలన్నారు.