టీఆర్ఎస్ త‌ట్ట‌బుట్ట స‌ర్దుకోవ‌డం ఖాయం : బాబు మోహ‌న్

N ANJANEYULU
తెలంగాణ‌లోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో  టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌చారం వేగాన్ని పెంచుతున్నారు. ఇవాళ వీణ‌వంక‌లో బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించింది. జ‌నం భారీగా త‌ర‌లివ‌చ్చారు. రోడ్ల‌న్ని జామ్ అయ్యాయి.  ఈట‌ల రాజేంద‌ర్‌కు మ‌ద్ద‌తుగా  సినీన‌టుడు, ఆంధోల్ బీజేపీ నేత బాబు మోహ‌న్ ప్ర‌చారం చేప‌ట్టారు. వీణ‌వంక‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.
హుజూరాబాద్‌లో వేట‌కుక్క‌ల్లా, తోడేళ్ల‌లా మీ ఎమ్మెల్యేల‌ను ఎందుకు తిప్పుతున్నావు కేసీఆర్ అని ప్ర‌శ్నించారు బాబు మోహ‌న్‌. ఈట‌ల ఒక్క‌డు గెలిస్తే ఏమ‌వుతుంది అని అన్న‌వారు ఇప్పుడు ఈ జ‌నాన్ని చూసి టీఆర్ఎస్ త‌ట్ట‌బుట్ట స‌ర్ధుకోవ‌డం మంచిద‌ని పేర్కొన్నారు. ఈట‌ల‌కు హుజూరాబాద్ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని తెలిపారు. బ‌డుగుల ప్ర‌తినిధిగా ఆయ‌న‌కు  ఎంతో గుర్తింపు ఉంద‌న్నారు.
క‌ట్టు క‌థ‌లు చెప్ప‌డంలో కేసీఆర్ దిట్ట అని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో అభివృద్ధి జ‌ర‌గాలంటే ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించాల‌న్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: