‘వెన్నుపోట్లకు, నమ్మకద్రోహాలకు చంద్రబాబు పేటెంట్‌దారుడు’

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిన్న‌టి వ‌ర‌కూ బ‌హిరంగంగా విమ‌ర్శించుకున్న నేత‌లు ఇప్పుడు తాజాగా ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శించుకుంటున్నారు. దీక్ష‌లు, ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో మైకుల్లో తిట్టుకున్న నేత‌లు సోష‌ల్ మీడియా వేదిక‌ను చేసుకుంటూ ట్విట్ట‌ర్‌లో తిట్టుకుంటున్నారు. తాజాగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయిలో జ‌రుగుతోంది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ట్విట్ట‌ర్ వేదికగా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. చంద్ర‌బాబు.. నేను విశ్వాస ఘాత‌కుడినే. అది నీ ఒక్క‌నికి మాత్ర‌మే.. ఇందిరాగాంధీకి, ఎన్టీఆర్‌, హ‌రికృష్ణ‌, ద‌గ్గుపాటి పెద్ద‌లు, మోడీ, అమిత్‌షాకు న‌మ్మ‌క ద్రోహివి అని వంశీ ట్వీట్ చేశాడు.

అదేవిధంగా వెన్నుపోట్ల‌కు, న‌మ్మ‌క‌ద్రోహుల‌కు, విశ్వాస‌ఘాతుకాల‌కు, నిఖార్సైన పేటెంట్ దారునివి నువ్వే చంద్ర‌బాబు అని ట్విట్ట‌ర్‌లో ధ్వ‌జ‌మెత్తారు.  నేను కేసీఆర్‌కు పోరుదండాలు పెడుతున్నాన‌ని పేర్కొన్నావు. నిజ‌మే. మ‌రి నువ్వు..?  కేసీఆర్ మోకాలుకు దండేసి మోర ఎత్తి ప‌ని చేస్తున్నావు క‌దా.. ఓటుకు నోటు కేసు తేలేవ‌ర‌కు అంతేగా.. అంటూ వంశీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: