దాడి చేసింది నా అనుచ‌రులే.. అయితే ఏంటి..?

N ANJANEYULU
ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి సీఎం జ‌గ‌న్‌పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా అట్టుడుకిపోయిన విష‌యం విధిత‌మే. అందులో భాగంగా మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంపై ప‌లువురు వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన విష‌యం తెలిసిందే.  ఈ విష‌యంపై ప‌ట్టాభిని అరెస్ట్ చేసి తొలుత గ‌వ‌ర్న‌ర్‌పేట‌, ఆత‌రువాత విజ‌య‌వాడ‌లోని తోట‌వ‌ల్లూరు  పోలీస్ స్టేష‌న్‌ల‌కు త‌ర‌లించి మ‌ర‌ల అక్క‌డ నుంచి ఆస్ప్ర‌తికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  విజ‌య‌వాడ‌ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టి.. మచిలీప‌ట్నం, రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన విష‌యం విధిత‌మే.
తాజాగా దీనిపై విజయ‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇన్‌చార్జీ దేవినేని అవినాష్ స్పందిస్తూ.. టీడీపీ జాతీయ కార్యాల‌యంలో దాడి చేసిన వారిలో నా అనుచ‌రులు ఉంటే ఉండ‌వ‌చ్చని.. అంత మాత్రాన వారిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇప్ప‌టికే అవినాష్ మ‌నుషులు దాడి చేసిన వారిలో ఉన్నార‌ని టీడీపీ ఆరోపించింది. ఈ త‌రుణంలో అవినాష్ ఇలా స్పందించాడు. సీఎం జ‌గ‌న్‌ను దూషించినందుకే మావాళ్లు దాడి చేశారు. దూషించి ఉండ‌కుంటే దాడులు జ‌రిగేవా అని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: