రాధేశ్యామ్: జపాన్, చైనావారు అడిగారు..?
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగే జంటగా నటించిన వింటేజ్ లవ్ స్టోరి 'రాధే శ్యామ్ టీజర్ను ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ మైండ్ బ్లోయింగ్ వ్యూస్తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కేవలం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతవరకు టాలీవుడ్లో ఏ మూవీ టీజర్కు రాని విధంగా భారీ వ్యూస్ను రాబడుతూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుదని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, కన్నడ భాషలతోపాటు చైనీస్, జాపనీస్ భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బాహుబలి కూడా చైనా, జపాన్ భాషల్లో విడుదల చేయడంవల్ల అక్కడ తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకున్నారు ప్రభాస్. తాజాగా రాధేశ్యామ్ కూడా విడుదల చేయబోతున్నారు.