ఏపీలో ఘోరం..ప్రత్యర్థి పార్టీకి మద్దతిచ్చాడని.. 100 కొబ్బరి చెట్లు నరికివేత
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రెబల్ అభ్యర్థికి, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు వెంకటయ్యరెడ్డి. దీంతో రాజకీయంగా అతనిపై కక్ష పెట్టుకున్నారు. వైసీపీ నాయకులు కావాలనే కక్షతోనే తమ కొబ్బరిచెట్లను నరికివేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా 100 కొబ్బరి చెట్లు నరికివేయడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు రంగంలోకి దిగి అక్కడే కాపాలా కాస్తున్నారు. బాధితుని కుటుంబం కంటితడ పెట్టింది. గ్రామస్తులందరూ నరికివేసిన కొబ్బరితోటను సందర్శించడానికి తండోపతండాలుగా తరలివెళ్లారు. ఆ గ్రామంలోని ప్రజలందరూ కొబ్బరితోట గురించే చర్చించుకోవడం గమనార్హం.