క‌ళా 'మా' త‌ల్లి: త‌ల్లిని కాపాడు విష్ణు: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

Garikapati Rajesh

ద‌స‌రా త‌ర్వాత‌రోజు హైద‌రాబాద్ జ‌ల‌విహార్లో అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్‌, ద‌త్తాత్రేయ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంచు విష్ణు తదిత‌రులు హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ విష్ణువైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని, ఇద్ద‌రూ మాట్లాడుకోలేద‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఈరోజు విష్ణు ఒక విష‌యాన్ని తెలియ‌జేశారు. ప‌వ‌న్‌, తాను స్టేజీమీద ఉన్న‌ప్ప‌టికీ ప్రోటోకాల్ ప్ర‌కారం మాట్లాడుకోవ‌డం కుద‌ర‌లేద‌ని, కానీ తామిద్ద‌రం మా విష‌యానికి సంబంధించి చ‌ర్చించుకున్నామ‌న్నారు. మా అనేది అంద‌రికీ త‌ల్లి లాంటిద‌ని, దాన్ని కాపాడ‌మ‌ని ప‌వ‌న్ సూచించార‌ని విష్ణు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ హాజ‌ర‌య్యారు అనే విష‌యాన్ని తెలియ‌జేసింది తానేన‌ని, ఆయ‌న అభిమానుల కోసం ఈ ప‌ని చేశాన‌న్నారు. మంచు కుటుంబానికికానీ, మెగా కుటుంబానికి కానీ మా ఎన్నిక‌ల వ‌ల్ల ఎటువంటి విభేదాలు త‌లెత్త‌లేద‌ని, వ‌చ్చే వార్త‌ల‌న్నీ అభూత క‌ల్ప‌న‌ల‌ని, వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. మా అధ్య‌క్షుడిగా క‌ళాకారుల సంక్షేమం, శ్రేయ‌స్సు కోసం తాను ప‌నిచేస్తాన‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: