క‌ళా 'మా' త‌ల్లి: ప‌వ‌ర్ లేకున్నా ప‌నిచేయ‌వ‌చ్చు?

Garikapati Rajesh

ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యాన‌ని, ఆ ప‌వ‌ర్ త‌న‌కుంటే మా అభివృద్ధి కోసం ప‌నిచేసేవాణ్ని అని ప్ర‌కాష్ రాజ్ అన్నారు. తాజాగా ఒక ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మా అసోసియేష‌న్లో ఎన్నో స‌మ‌స్య‌లున్నాయ‌ని, వాటిని బాగుచేయ‌డం కోసం రంగంలోకి దిగాన‌ని, స‌భ్యుల సంక్షేమం కోస‌మే తాను పోటీచేశాన‌ని, గెలిచుంటే త‌న‌దైన శైలిలో అభివృద్ధి చేసేవాణ్ని అన్నారు. ఇప్పుడు న‌న్ను న‌మ్మి ఓటేసిన‌వారంద‌రికోసం విష్ణు ప్యానెల్‌ను ప్ర‌శ్నిస్తుంటూనే ఉంటాన‌న్నారు. వారి కోస‌మే ప‌నిచేస్తాన‌ని, ఏయే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.. ఏయే అభివృద్ధి ప‌నులు చేస్తున్నారంటూ వారిని నిల‌దీస్తుంటాను. ప్ర‌తిసారీ రిపోర్టు కార్డ్ ఇవ్వ‌మ‌ని అడుగుతుంటాను అన్నారు. నిజంగా మా మీద‌, మా స‌భ్యుల మీద‌, క‌ళాకారుల మీద ప్రేమ ఉంటే ప‌వ‌ర్ లేక‌పోయినా ప‌నిచేయ‌వ‌చ్చ‌ని, సంస్థ‌ను అభివృద్ధి చేయ‌డానికి మా అధ్య‌క్ష ప‌ద‌వి ఒక్క‌టే కాద‌ని, బ‌య‌ట నుంచి ఎన్నోర‌కాలుగా ప‌నిచేసి మాను అభివృద్ది ప‌థంలో ప‌య‌నింప చేయ‌వ‌చ్చంటూ ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: