కళా 'మా తల్లి: విష్ణు కోసం బీజేపీ?
మా అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పనిచేశాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. మంచు విష్ణు విజయం కోసం భారతీయ జనతాపార్టీ పనిచేసిందన్నారు. దేవుణ్ని నమ్మని ప్రకాష్ రాజ్ పనిని నమ్ముతారు. నలుగురికి సాయం చేస్తుంటారు. అది మాత్రమే ఆయనకు తెలుసు. అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇలా మాట్లాడితే ఒకరకంగా ఉంటుంది.. లేదంటే మరోరకంగా ఉంటుంది అంటూ లెక్కలేసుకొని ఆచితూచి మాట్లాడరు. ఆ ముక్కుసూటితనం చాలామందికి నచ్చలేదు. దేశంలో మోడీ పరిపాలన ఎలావుందో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. తరుచుగా మోడీగురించి పలు వేదికలపై తన గళం వినిపించే ప్రకాష్ రాజ్ను భారతీయ జనతాపార్టీ నేతలు లక్ష్యంగా ఎంచుకున్నారు. వాస్తవాలు మాట్లాడితే రాజకీయ నేతలు జీర్ణించుకోలేరు. అలాగే తమవైపు ఎవరైనా వేలెత్తి చూపితే తట్టుకోలేరు. అందుకే ప్రకాష్ రాజ్ ఆరోపణల్లో వాస్తవముందా? లేదా? అనేది ఆయనకు, విష్ణుకు, మోహన్బాబుకే తెలియాలి. ఏదేమైనా ప్రకాష్ రాజ్ను ఓడించడానికి బీజేపీ పనిచేసిందంటే అర్థం చేసుకోవచ్చంటున్నారు తెలుగు ప్రజలు. అందుకు తగ్గట్లుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రకాష్ రాజ్ ఓటమిపాలైనప్పుడు ఘాటుగా వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతోంది.