మా పోరు : జెనీలియా ఏమ‌న్నదంటే?

RATNA KISHORE
మా ఎన్నిక‌లు మ‌రో మూడు గంట‌ల‌లో ముగియ‌నున్నాయి. ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు ప్రారంభం అయిన పోలింగ్ త్వ‌రిత‌గ‌తిన సాగుతోంది. సీనియ‌ర్ న‌టులు వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుని వెళ్లారు. స‌భ్యులలో ఉత్సాహం నింపారు. అదేవిధంగా ముంబై నుంచి జెనీలియా (బొమ్మ‌రిల్లు ఫేం) ఫ్లైట్ లో హైద్రాబాద్ కు చేరుకుని, ఓటింగ్ లో పాల్గొని, ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటారు.
ఓటింగ్ జ‌రుగుతున్న ప్రాంగ‌ణాన ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి, అంద‌రి అభినంద‌న‌లూ అందుకున్నారు. తొలుత ఆమెను మంచు విష్ణు ను గ్రాండ్ గా రిసీవ్ గా చేసుకున్నారు. ఇక ఓటు వేసి వ‌చ్చాక జెనీలియా మాట్లాడుతూ.. మా అసోసియేష‌న్ కు సూప‌ర్ ప్రెసిడెంట్ రానున్నార‌ని చెప్పి, మ‌రింత ఆస‌క్తి పెంచారు. అదేవిధంగా రోజా కూడా ఈ ప్రాంగణానికి చేరుకుని ఓటు హ‌క్కు వినియోగించుకుని,
ఎన్న‌డూ లేనివిధంగా ఇటువంటి వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం బాధాక‌రం అని వ్యాఖ్యానించి, ఎవ‌రికి ఎవ‌రూ శ‌త్రువులు కాద‌ని తేల్చి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: