మా ఎన్నిక‌ల సీరియ‌ల్ బ్యాలెల్ పేప‌ర్‌ విడుద‌ల

N ANJANEYULU
 మూవీ ఆర్టీస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే. ఈ ఎన్నిక‌ల‌పై రోజు రోజుకు ఉత్కంఠ నెల‌కొంది. మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తంగా జ‌రుగ‌నున్నాయి. తాజాగా మా ఎన్నిక‌ల‌కు సంబంధించి సీరియ‌ల్ బ్యాలెట్ పేప‌ర్‌ల‌ను విడుద‌ల చేశారు. విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. ఇప్ప‌టికే ఇరు ప్యాన‌ల్‌ల అభ్య‌ర్థులు ఓట‌ర్ల ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి త‌మ త‌మ ప్ర‌చారాన్ని చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 400 మంది మాత్ర‌మే ఓటు వినియోగించుకున్నారు. ఈసారి ఎంత‌మంది ఓటు వినియోగించుకుంటార‌నే ఆస‌క్తి క‌రంగా మారింది.
  మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో 8 ఓట్లు ఉన్నాయి. మోహ‌న్‌బాబు కుటుంబంలో 3 ఓట్లు ఉన్నాయి. విక్ట‌రీ వెంక‌టేష్ కుటుంబంలో వెంక‌టేష్‌, రానా, బాల‌కృష్ణ కుటుంబంలో బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌,  క‌ళ్యాణ్‌రామ్‌, తార‌క‌రామ్‌. కృష్ణ కుటుంబంలో కృష్ణ‌, ర‌మేష్‌, న‌రేష్‌, మ‌హేశ్‌బాబు, సుధీర్‌బాబు ఉన్నారు. వీరంద‌రిలో ఈసారి ఎవ‌రెవ‌రూ ఓటు వినియోగించుకుంటారు అనేది ఓ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయ ఎన్నిక‌లలా మా ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. తాజాగా రోజా ఈ ఎన్నిక‌ల‌పై స్పందిస్తూ  తాను లోక‌ల్, నాన్ లోక‌ల్‌ను నిరాక‌రిస్తాను. ఎవ‌రి మ్యానిఫెస్టో బాగుంటే వారికి ఓటు వేస్తాన‌ని ప్ర‌క‌టించింది.  ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా ప్ర‌కాశ్‌రాజ్‌, మంచువిష్ణు అధ్య‌క్షులుగా, జీవిత‌, ర‌ఘుబాబు జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీలుగా బ‌రిలో ఉన్నారు.  మ‌రి ఎన్నిక‌లు ఎంత మంది వినియోగించుకుంటారో అక్టోబ‌ర్ 10 వ‌ర‌కు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: