బండి ఆవేదన, కేసీఆర్ మమ్మల్ని మోసం చేస్తున్నారు...!

కామారెడ్డి జిల్లాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఎల్లారెడ్డి లో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పీకింది ఏమీ లేదు అన్నారు. కేంద్రంలో పీకింది ఏమీ లేదు అని విమర్శించారు. దేశంలో 78 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని స్పష్టం చేసారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యమ కారులకు పెన్షన్లు ఇస్తాం అని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం నాడు కేసీఆర్ జెండా ఎగరవేయలేదు అని విమర్శించారు.
ర్రెలు ఇస్తామని మోసం చేసారు అన్నారు. గొర్రెలు బర్రెలు అయ్యాయి అన్నారు. ఎం ఐ ఎం భయానికి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. రుణ మాఫీ చేయలేదు అని భూసార పరీక్షలకు కేంద్రం 120 కోట్లు మంజూరు చేసింది వివరించారు. కేంద్రం వరి కొనవద్దని అంటు రైతులకు మోసం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మంచి చేస్తే నేను చేసానని, చెడు చేస్తే కేంద్రం పై నెట్టి వేస్తారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: