రాజు ఆత్మ'హత్య' : పోలీసులకు ముందే దొరికాడా?

Chaganti
సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల పాపను అత్యంత కిరాతకంగా రేప్ చేసి చంపిన రాజు ఎవరూ ఊహించని పరిస్థితుల్లో శవమై పట్టాల మీద తేలాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ దగ్గరలో ఉన్న రైల్వే పట్టాల మీద ఒక గుర్తు తెలియని మృతదేహం లభించడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి శవాన్ని పరీక్షించారు,  అతని చేతిమీద మౌనిక అనే పచ్చబొట్టు ఉండడంతో అది రాజు మృతదేహం గానే భావిస్తున్నారు.  అయితే రాజుది నిజంగానే ఆత్మహత్యనా లేక పోలీసుల ప్రోద్బలంతో ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కొద్ది రోజుల క్రితం నిందితులు అరెస్ట్ అయినట్లుగా వార్తలు వెలువడ్డాయి, అదే రోజున కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ కూడా చేశారు. కానీ తర్వాత ప్రజల నుంచి అతనిని ఎందుకు కూర్చో పెట్టి మేపుతున్నారు ఎన్కౌంటర్ చేసేయండి అని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అతను తమకి ఇంకా దొరకలేదని పట్టించిన వారికి పది లక్షల బహుమతి కూడా ఇస్తామని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు.. ఈ విషయంలో కేటీఆర్ కూడా అలర్ట్ అయ్యి వెంటనే తాను పొరపాటుగా ట్వీట్ చేశానని అతడు దొరికితే 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆయన అలా అంటూ ట్వీట్ చేసారో లేదో  ఈరోజు ఉదయాన్నే రాజు మృతదేహం రైల్వే పట్టాల మీద దొరకడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: