బిగ్ బ్రేకింగ్: రఘురామ పిటీషన్ కొట్టేసిన సిబిఐ కోర్ట్
సాక్షులను ప్రభావితం చేస్తారని అలాగే రాష్ట్ర ప్రభుత్వం లో కొంతమంది కీలక అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నారు అని రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుపుతూ వస్తున్న కోర్టు రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ఊరట లభించినట్లయింది. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ను కూడా సిబిఐ కోర్టు కొట్టివేయడం విశేషం.