బ్రేకింగ్: రఘురామకు బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణా హైకోర్ట్...!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తెలంగాణా హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ కు సంబంధించి సిబిఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ కు సంబంధించి మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు తెలంగాణా హైకోర్ట్ లో పిటిషన్ వేశారు.
దానిపై కోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. జగన్, విజయసాయి బెయిల్ పిటిషన్ పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జగన్ విజయసాయి బెయిల్ పిటిషన్లపై కాసేపట్లో సిబిఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక తీర్పు విషయంలో ముందు ధీమాగా ఉన్న రఘురామ కృష్ణం రాజు ఆ తర్వాత మాత్రం వెనుకడుగు వేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: