వినాయకుడి విగ్రహాలకు జియో ట్యాగింగ్...?
బల్దియా సూచించిన చెరువుల్లోనే విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ విగ్రహం ఏ చెరువులో నిమజ్జనం చేయాలో జియో ట్యాగింగ్ లో పొందుపర్చాలని నిర్ణయం తీసుకున్నారు. విగ్రహాల నిమజ్జనం లో గందరగోళం లేకుండా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు అధికారులు. జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేస్తారు మంత్రి. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.