అసలు సాయి ధరమ్ తేజ్ పరిస్థితి ఏంటీ...?

టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ కి ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది. మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో అతను గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన తర్వాత వెంటనే మేడికవర్ ఆస్పత్రికి ఆ తర్వాత అపోలో ఆస్పత్రికి తరలించారు. చాతికి, కంటికి అతనికి దెబ్బలు తగిలాయని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అతనికి కొన్ని ఆపరేషన్ లు కూడా చేయాల్సి ఉంది.
ఇక కాలర్ బోన్ ఆపరేషన్ పూర్తి అయిందని వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు వెంటిలేటర్ పైనే సాయి ధరంతేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 24 గంటలు పాటు  పర్యవేక్షణలో ఉంచే అవకాశం ఉంది. అతని ఆరోగ్య పరిస్థితికి ఆందోళన లేకపోవడంతో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఇంటికి వెళ్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇంకా సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: