సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్... సినిమాకు వెళ్ళిన బన్నీ...?

టాలీవుడ్ లో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం ఇప్పుడు సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం విషయంలో తేజ్ మీద కేసు కూడా నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని మెగా ఫ్యామిలీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటె కాకినాడ లో అల్లు అర్జున్ సినిమాకు వెళ్ళడం సంచలనం అయింది.
పద్మప్రియ హాల్లో మ్యాట్నీ షో సిటీమార్ సినిమాను అల్లు అర్జున్ వీక్షించడం హాట్ టాపిక్ అయింది. కాకినాడ పోర్టులో పుష్ప సినిమా షూటింగ్ కోసం ఆయన నగరానికి వెళ్ళారు. ఒక పక్క సాయి ధరమ్ తేజ  ప్రమాదానికి గురి అయినా మీడియా ముందు మాత్రం ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: