రేవంత్ కావాలి... వాళ్ళు కావాలి...?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం పట్ల కొంత మంది కీలక నేతలు సీరియస్గా ఉన్నారు అని ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జాగ్రత్త పడుతుంది. ప్రజల్లో ఆదరణ లేని నాయకులను పక్కన పెట్టి ప్రజల ఆదరణ ఉన్న నాయకత్వాన్ని ఢిల్లీ పిల్లి మాట్లాడే ఆలోచనలో ఉన్నారని ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ అలాగే ఉత్తంకుమార్ రెడ్డి ని ఢిల్లీ పిలిచి మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా సరే కొంతమందికి ఆయనకు సహకరించకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జాగ్రత్త పడుతూ వస్తోంది. అందుకనే కొంతమందిని త్వరగా ఢిల్లీ పిలిచి సర్ది చెప్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: