లోకల్లో ఓకే కానీ సత్తా చాటాలంటే కలవాల్సిందే !

Chaganti
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ అనంతరం  మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు , ఇప్పటి పరిస్థితుల్లో  కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమే అని పేర్కొన్న ఆయన అసలు మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలని అన్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో శక్తివంతంగా ఉన్నాయి, కానీ అన్నీ కలవాలంటే కామన్ అజెండా ఒకటి  కావాలని ఆయన పేర్కొన్నారు. అయితే తీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో ఓ జాతీయ పార్టీ అధికారంలోకి రావడం కూడా కొంత కష్టమేనని విశ్లేషించిన ఆయన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో స్థిరంగా ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు.  మోదీ పాలనపై నేనేమీ మాట్లాడను అని అంటూనే ఏడేళ్ల మోడీ ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. ఇక జేడీఎస్ బీజేపీ కారణంగా అధికారం కోల్పోయిన సంగతి విదితమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: