అంబటి టీడీపీని ఎందుకు తిట్టలేదు...?

సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కి సంబంధించి ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుకన్య అనే మహిళతో అంబటి రాంబాబు ఫోన్ మాట్లాడుతున్నట్టుగా బయటకు వచ్చిన ఒక వీడియో అలాగే దానికి సంబంధించిన ఆడియో అంబటి రాంబాబుకి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఈ వీడియో కి సంబంధించి వైసీపీ నేతలు కూడా అంబటి రాంబాబుపై ఆగ్రహంగా ఉన్నారు అని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

దీనిపై అంబటి రాంబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ తన పై కుట్రలు జరుగుతున్నాయని ఆయన సరే అదరు బెదరను అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటపెట్టారు అనేది కొంతమంది మాట్లాడే మాట. ఈ తరుణంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని అంబటి రాంబాబు చెప్పడం తెలుగుదేశం పార్టీపై ఎటువంటి విమర్శలు చేయక పోవడంతో అసలు అంబటి తెలుగుదేశం పార్టీని ఎందుకు విమర్శించలేదు అనేది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: