షాకింగ్ : ప్రముఖ నటి కన్నుమూత

Chaganti
మలయాళ నటి శరణ్య సోమవారం క్యాన్సర్ తో మరణించాడు. 2012 నుండి అరుదైన బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న శరణ్య శశి కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతోంది. అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు శరణ్య కన్నుమూశారు. ఆమె వయస్సు 35 సంవత్సరాలు. మే చివరలో కోవిడ్ -19 సోకిన తర్వాత న్యుమోనియా కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరింది. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతోంది. ఏప్రిల్ 2021 లో శస్త్రచికిత్స తర్వాత, ఆమె మంచానికే పరిమితం అయింది. తరువాత మెడికల్ సిబ్బంది కేర్ తో పాటు ఆమె సంకల్పం కూడా బలం చేకూర్చడంతో మళ్లీ కోలుకుంది. చికిత్స ప్రారంభ సమయంలో ఆమె 11 శస్త్రచికిత్సలు (మెదడు కణితిని తొలగించడానికి తొమ్మిది, ఆమె థైరాయిడ్‌లో గ్రోత్‌లను తొలగించడానికి రెండు ఆపరేషన్లు) చేయించుకుంది. శరణ్య చిన్న వయసులోనే మరణించడం ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: