జగన్ సార్ పెళ్లికెళ్తున్నారా?

Chaganti
ముఖ్యమంత్రి వైయస్ జగన్ కరోనా కలకలం మొదలైన తర్వాత బయటికి రావడం చాలా తగ్గించారు. ఎంతో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. మరీ ముఖ్యంగా ఆసుపత్రులలో ప్రమాదాలు జరిగి చనిపోయిన ఘటనలో కూడా బాధితులను సందర్శించిన దాఖలాలు లేవు. కానీ ఆయన తన ఎమ్మెల్యేల శుభకార్యం ఉంటే మాత్రం తప్పకుండా హాజరు అవుతున్నారు. ఈ విషయం మీద ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తునా వెనక్కి తగ్గడం లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి భీమవరం ఎమ్మెల్యే వాసుబాబు కూతురు వివాహానికి హాజరు కాబోతున్నాడు. ఈ నెల 14న భీమవరం లో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు కుమార్తె పెళ్లి జరగనుంది. అక్కడి "కె" కన్వెన్షన్ సెంటర్ ను వివాహ వేదికగా మార్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎమ్మెల్యే వాసుబాబు కుమార్తె వివాహ వేడుక కోసం భీమవరం వెళ్తున్నారు. ఆయన భీమవరం వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సన్నాహాల్లో భాగంగా అధికారులతో కలిసి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హెలిప్యాడ్ కు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. జగన్ మోహన్ రెడ్డి భీమవరం టూర్ కు కారణం ఎమ్మెల్యే కూతురు పెళ్లి అన్నమాట. వాసుబాబు కుమార్తె పెళ్ళికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కానుండడం విశేషం. ఇకఈ వేడుకలో పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొనబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: