లాక్ డౌన్ లోనూ అండగా నిలిచింది మేమే!

Chaganti
యాదాద్రి- భువనగిరిలో ఈరోజు బీజేపీ అనుబంధ శాఖ అయిన బీజేపీ కిసాన్ మోర్చ సమావేశం అయింది. ఈ సమావేశం అనంతరం యాదాద్రి- భువనగిరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆలోచనలు మార్చాలని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కిసాన్ మోర్చా మొట్ట మొదటి సమావేశం ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. 


ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయదన్న ఆయన అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడి సరుకుల ధరలు పెరిగినా,  రైతులకు సబ్సిడీ పై డీఏపీ అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలను ఎండ గట్టే పార్టీ బీజేపీ కిసాన్ మోర్చ అని ఆయన అన్నారు, లాక్ డౌన్ లో నూ నిరుపేద రైతులకు అండగా నిలిచింది భారతీయ కిసాన్ మోర్చ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: