సిగ్గు ఉండాలి మనకి... సిఎస్ పై బాబు ఫైర్...?

భారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేసిన శ్రీకాకుళంకు చెందిన లావేటి ఉమమహేశ్వరరావు కుటుంబంకు ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాధ్ దాస్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నేడు లేఖ రాసారు. మన జీవితాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించడం మన కర్తవ్యం అని అలాంటి వారిలో శ్రీకాకుళం నుంచి భారత సైన్యంలో లాన్స్ నాయక్ గా పనిచేసిన లావేటి ఉమమహేశ్వరరావు ఒకరు అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఉమామహేశ్వరరావు భారత సైన్యంలో 17 సంవత్సరాలు పనిచేశారు అన్ని ఆయన వెల్లడించారు. 2020 జూలై 18 న లడఖ్ లోని బటాలిక్ సెక్టార్ లో బాంబు నిర్వీర్యం చేస్తుండగా చనిపోయారు అన్నారు. ఉమామహేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. ఉమమహేశ్వరరావు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు అని ఉమామహేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సహాయం మంజూరు చేయడంలో ఆలస్యం జరిగినందుకు సమిష్టిగా మనమందరం సిగ్గుపడాలి అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: