బీజేపీ పొగ పెడితే కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు : బండి సంజ‌య్

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లా బిజెపి పార్టీ కార్యాలయాన్ని బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సంధ‌ర్బంగా ఆయ‌న మాట్లాడ‌తూ...రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశడంటూ వ్యాఖ్యానించారు. దాంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నీవు తాగి ఫాంహౌస్ లో పడుతున్నావు....ఈ ఆత్మహత్యలకు కార‌ణం కేసీఆరే అంటూ ఆరోపించారు. క‌రోనా వచ్చి రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే బయటికి రావు..
 భారతీయ జనతా పార్టీ పొగ పెడితే ప్రగతి భవన్ నుండి మెల్లగా బయటికి వచ్చావంటూ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్యమంత్రి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు వేసిన రైతు బంధు డ‌బ్బుల‌ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను బ్యాంకులు  కట్ చేసుకుంటున్నాయన్నారు. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని బండి సంజ‌య్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను  నెరవేర్చకపోతే... నెరవేర్చే వ‌ర‌కూ బీజేపీ వెంట‌ప‌డుతుంద‌న్నారు. రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా లోని నాలుగు అసెంబ్లీల్లో బీజేపీ జండా ఎగ‌ర‌వేస్తామ‌ని దీమా వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: