వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ అశోక్ గజపతిరాజు పై వరుస విమర్శలు చేస్తున్నారు. అశోక్ గజపతి రాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమించాలని...సంచయిత గజపతి రాజును తొలగించాలని కోర్టు తీర్పు వచ్చిన నాటి నుండి అశోక్ గజపతి రాజు మరియు అధికార పార్టీ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అశోక్ గజపతి రాజుకు విజయ సాయికి మాటల యుద్దం నడుస్తోంది.
కాగా తాజాగా విజయ సాయి రెడ్డి సోషల్ మీడియాలో....పంచగ్రామాల సమస్యను పరిష్కరించి పేదలకు మేలు చేయమంటే...పూసపాటి అశోక్ కొర్రీలు పెడతూ పచ్చ గద్దలకు మాత్రం భూముల్ని కట్టబెట్టాడంటూ విజసాయి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి మూడేళ్లకోసారి దేవాలయ ఆస్తుల్లో మార్పులు చేర్పులు నమోదు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. నీవు ధర్మకర్తగా ఉన్న ఆలయాల్లో ఆ పనిచేశావా అశోక్? అంటూ ప్రశ్నించారు. నీ ముసుగు తొలగిపోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.