తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై దాడులు చేసే రోజు త్వరలో వస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్పై జరిగిన దాడిని బండి సంజయ్ ఖండించారు.సురేష్ యాదవ్ని పరామర్శించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఆత్మబలిదానాలకు తెగించి కోట్లాడిని గడ్డ ఈ ఉస్మానియా యూనివర్శిటీనేన్నారు.రాష్ట్రం ఏర్పాడటానికి ఓయూ విద్యార్థులు ప్రధానపాత్ర పోషించారని...సీఎం కేసీఆర్ డైరెక్షన్లో టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పతనం మొదలైందని...ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు నేరవేరడంలేదన్న సురేష్ యాదవ్పై టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలందరు చూస్తుంటేనే సురేష్యాదవ్పై దాడి జరిగిందని...తిరిగి సురేష్ యాదవ్ కుటుంబంపైనే కేసులు పెట్టారని తెలిపారు.సురేష్యాదవ్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: