తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు.. ఏ సమయం దాకా అంటే?

Chaganti
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సిఏం అధికారిక నివాసం అయిన ప్రగతి భ‌వ‌న్‌లో జరుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజ‌రు అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అంటున్నారు. కరోనా వైరస్ నియంత్రణ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా లాక్‌డౌన్‌ను మరింత సడలించే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సామాన్యులకు మరింత ఊతం ఇచ్చేలా సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ మాత్రమే అమలులో ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: