ఏపీ సీఎం జగన్ గురువారం క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ...పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని చెప్పారు. 175 నియోజక వర్గాల్లో తొలిదశలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. ఒక్కో ఇళ్లు నిర్మాణం ద్వారా 5 లక్షల రూపాయల ఆస్తిని లబ్దిదారుల చేతుల్లో పెడతామని అన్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పండుగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఇంటి నిర్మాణానికి సామాగ్రి ఇవ్వమంటే ఇస్తాం..లేదంటే అవసరమైన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తామని తెలిపారు. ఇళ్లు కట్టుకోలేని వారికి దగ్గరుండి ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రతి ఇంటిలో రెండు ఫ్యాన్లు, లైట్లు, వాటర్ ట్యాంక్ ను కూడా అమర్చుతామని హామీ ఇచ్చారు . దేశంలో ఎక్కడా లేని విధంగా కాలనీల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం మొదటి దశలో 16 లక్షల 60వేల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రం మొత్తం koti reddy SARIPALLI' target='_blank' title='కోటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటి 24లక్షల మందికి ఇల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని అన్నారు.