లాక్ డౌన్ పొడిగింపు : కేసీఆర్ ఫోన్ సర్వే

Chaganti
తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించనున్నారని మరో వారం పాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజానికి కరోనా కట్టడికి లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వం మొదట్లో వెనకడుగు వేసింది. లాక్ డౌన్ అవసరం లేదని భావించి కేసీఆర్ కూడా ప్రకటనలు గుప్పించారు. అయితే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరడగంతో లాక్ డౌన్ విధించడం తప్పనిసరైంది. 


దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేసింది ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ పొడిగింపు మీద కేసీఆర్ ఫోన్ లో సర్వే చేస్తున్నారని అంటున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకి కాల్ చేసి అభిప్రాయం కోరుతున్నట్టు చెబుతున్నారు. వారి అభిప్రాయం మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: