కొవిడ్‌ నిబంధనలు బేఖాతర్‌..ఎమ్మెల్యే పై సర్వత్రా విమర్శలు..!!

Madhuri
కరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మే 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపునిచ్చింది. అయితే, వికారాబాద్ పరిగి ఎమ్మెల్యే మాత్రం ఆ మినహాయింపును పట్టించుకోకుండా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు.వికారాబాద్ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లాక్‌డౌన్ నిబంధనలను గాలికొదిలేశారు. ఉదయం పది దాటినా పట్టించుకోని ఎమ్మెల్యే తన కార్యకలాపాలను కొనసాగించారు. దోమ మండల కేంద్రంలో ఉదయం పది తర్వాత కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కరోనా నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ భారీగా జనాలు తరలి వచ్చారు. చెక్కుల కోసం వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు గుమిగూడారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: