ఎల్లో వైరస్ ?

Madhuri
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ రచ్చగా వుంటాయి. నిత్యం ట్వీట్టర్ లో ట్వీట్ లు పెడుతూ కౌంటర్లు ఇచ్చే వ్యక్తి ఏవరు అంటే అందరు టక్కున చెప్పే పేరు వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి.  ఎప్పుడు టీడీపీ పై, టీడీపీ అధినేత చంద్ర బాబు పై సెటైర్స్ వేస్తూ.. ఫన్ని కామెంట్స్ పెట్టే విజయ సాయి రెడ్డి మరోసారి తండ్రి కొడుకులను తన ట్వీట్ తో చెడుగుడు ఆడుకున్నాడు. ఈ మేరకు ఆయన అధికారక ట్వీట్టర్ ఖాతలో.." రాజకీయంగా నిరుద్యోగులైన తండ్రి-కొడుకులు .. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేయడానికి అవకాశం లేదు. అందుకే.. కరోనా గురించి అబద్ధాలు ప్రచారం చేయడం ద్వార వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ మరింత ప్రమాదకరమని ప్రజలు ఇప్పటికే గ్రహించారు " అంటూ ట్వీట్ చేసారు విజయసాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: