రఘు రామ కృష్ణం రాజుపై సైరా పంచ్

తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార వైసీపీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చాలా కీలకంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ లో సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ అగ్ర నేతలు అందరూ కూడా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక పంచ్ వేసారు. “సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే ధైర్యం లేదు - ప్రజలను గాలికొదిలేశాడు. నాకు ప్రాణభయం ఉంది. కొట్టేస్తారు. చంపేస్తారని పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ కామెడీ పీస్ లా కాలక్షేపం చేస్తున్నాడు. ఫోర్జరీ పేపర్లతో బ్యాంకులను ముంచేసినవాడే  పచ్చచొక్కాల సాన్నిహిత్యంతో కోర్టు మెట్లెక్కుతున్నాడు.” అంటూ రఘు రామకృష్ణం రాజుని టార్గెట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: