ఆడ మగా తెలియని టీడీపీ నాయకుడు: విజయసాయి

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ నేతలను అన్ని విధాలుగా టీడీపీ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను కూడా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక రాజకీయంగా టీడీపీ బలహీనంగా ఉన్న నేపధ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇక తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమాపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
నకిలీ వీడియో లు సృష్టించారు అనే ఆరోపణ తో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. “కూన అనే కుహనా నాయకుడేమో దౌర్జన్యాలు చేసి పరారవుతుంటాడు.  ఆడో, మగో  తెలియని మరొకరేమో సీఎంగారిపై బురద జల్లడానికి నకిలీ వీడియోలు సృష్టిస్తుంటాడు. ఇద్దరికీ గత ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పినా తీరు మార్చుకోలేదు. యథా అధ్యక్ష -  తథా నాయక అన్నట్లు టీడీపీ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నారు.” అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: