చంద్రబాబు అప్పుడే బయటకు వచ్చేది... కార్యకర్తలు బాబుని లైట్ తీసుకున్నారు

ఓడిపోతామని తెలిస్తేనే చంద్రబాబు నాయుడు ఇలా బయటకు వస్తారు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్ధులు లేరని అన్నారు. చంద్రబాబుపై కార్యకర్తలకు  నమ్మకం పోయిందని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబుకి తెలియదా అని ప్రశ్నించారు. ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు ఇలా డ్రామాలు ఆడతారని ఆయన వ్యాక్గ్యలు చేసారు.
నిన్న రాత్రే పర్మీషన్ ఇవ్వనప్పుడు కోర్ట్ కి ఎందుకు వెళ్ళలేదు అని ఆయన నిలదీశారు. చంద్రబాబు చేసేవి అన్ని అనవసర డ్రామాలు అని ఇలాంటి చేయడం చంద్రబాబు నాయుడు కి అలవాటు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చారని నిలదీశారు. ఇక చంద్రబాబుపై మంత్రులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: