మరీ ఇంత దుర్మార్గంగానా.. చంద్రబాబు, పవన్‌లపై ఆయన షాకింగ్ కామెంట్స్..!!

VUYYURU SUBHASH
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా‌ ముగిసింది. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ లో మొత్తంగా 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. వీటిలో 579 ఏక గ్రీవాలు అయ్యాయి. అయితే, ఈ మూడో దశ ఎన్నికల్లో సైతం వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుంది అని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే,  ప్రతిపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏకగ్రీవాలు అనర్థమని చెప్పటం బాధాకరం అని.. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై చంద్రబాబు, పవన్‌లు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.  పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం అయితే తప్పు ఎలా అవుతుందంటూ అంబటి రాంబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ లపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: