వొడాఫోన్, ఐడియా సంస్థలు రూ.వెయ్యి కోట్లు ఇచ్చాయి ఎందుకో తెలుసా..!

Lokesh

ప్రముఖ సంస్థ వొడాఫోన్‌-ఐడియా ఏజీఆర్‌ బకాయిల కింద శనివారం మరో రూ.1,000 కోట్లు టెలికాం విభాగానికి చెల్లించింది. తాజా చెల్లింపులతో కలిపి ఇప్పటివరకు టెలికాం విభాగానికి వొడాఫోన్‌-ఐడియా మొత్తం రూ. 7,854 కోట్లు చెల్లించింది.

 

జులై మూడో వారంలో విచారణ సమయానికి వొడాఫోన్ ఐడియా, ఎయిర్​టెల్​లు తమ ఆర్థిక స్థితిపై స్టేట్​మెంట్​ను సమర్పించాలని సుప్రీం కోర్టు గత నెలలో సూచించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వానికి డబ్బు అవసరమని.. ఇందుకోసం ఆయా టెలికాం సంస్థలు కొంత ఏజీఆర్​ బకాయి కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ ఐడియా రూ.వెయ్యి కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: