ఎయిర్టెల్ కష్టమర్స్ కి ట్రాయ్ షాక్

ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ట్రాయ్ షాక్ ఇచ్చింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ప్లాటినమ్, వొడాఫోన్ ఐడియాకు చెందిన రెడ్‌ఎక్స్ ప్రీమియం ప్లాన్స్‌ను  బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

 

ఈ ప్లాన్స్ తీసుకున్న కస్టమర్లకు కంపెనీలు ఫాస్టర్ డేటా స్పీడ్, ప్రియార్టీ సర్వీసెస్ అందిస్తుండగా కస్టమర్ కేర్ సేవలు కూడా చాలా వరకు ప్రత్యేకంగా లభిస్తూ ఉంటాయి. ఈ ప్లాన్స్ తో మొబైల్ క్వాలిటీ సర్వీసెస్ తగ్గుతాయని, ఈ ప్లాన్స్ ఎంచుకోనివారు నష్టపోయే అవకాశం ఉంది అని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే రద్దు అవుతుంది అని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: