వొడాఫోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్... ఫ్రీ డేటా ?

Reddy P Rajasekhar

లాక్ డౌన్ వల్ల గతంతో పోలిస్తే ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. టెలికాం కంపెనీలు కూడా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ వినియోగదారులకు అదనపు రుసుము చెల్లించకుండా 2జీబీ, 5జీబీ డేటాను ఉచితంగా పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫ్రీ డేటా కావాలనుకునేవారు వొడాఫోన్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
149, 249, 399, 599 రూపాయల ప్లాన్ లను రీఛార్జ్ చేసుకునే వారందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. 149 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వారు ఇప్పటికే పొందుతున్న 1 జీబీ డేటాకు అదనంగా మరో 1 జీబీ డేటాను పొందవచ్చు. ఇతర ప్లాన్లకు కూడా రీఛార్జ్ ను బట్టి ఫ్రీ డేటా లభిస్తుంది. వొడాఫోన్ యాప్, వెబ్ సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వారు మాత్రమే ఈ ఆఫర్ ను పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: