ముఖం పై ముడతలు చిటికెలో తగ్గే టిప్?

Purushottham Vinay
చాలా మంది కూడా ముఖం పై ముడతలు పడి నలుగురిలో బాగా ఇబ్బంది పడుతుంటారు.అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. వాటిని తగ్గించుకోవడం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ఔషధాలు వాడుతూ ఉంటారు.అయితే అవి వాడటం కంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.అలోవెరా జెల్ ముఖానికి చాలా మంచిది. దీన్ని తీసుకుని చర్మానికి అప్లై చేయాలి.ఒక 10-15 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ గుజ్జులో పసుపు కలిపి రాసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి.అలాగే కొన్ని కొబ్బరి పాలలో దూదిని నానబెట్టాలి. దానిని ముఖం పై ఒక 15 నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తరువాత దానితో ముడతలు ఉన్న ప్రదేశాన్ని ప్యాక్ చేసి.. తర్వాత చల్లని నీటితో కడగాలి. కొబ్బరి పాలు ఈ సమస్యని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇంకా అంతే కాకుండా చర్మానికి మంచి రక్షణ అలాగే పోషణ అందిస్తాయి.


ఇంకా పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా తీసుకొని వాటిని పేస్ట్‌గా చేసి.. ఒక 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి ఆ పేస్ట్ చర్మంలో కలిసిపోయే దాకా స్క్రబ్ చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా కనుక చేస్తే.. ముడతల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.అలాగే శెనగపిండి అనేది మీ చర్మాన్ని కాంతివంతం చేయడంలో బాగా సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు ఇంకా పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత దానిని ఒక మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి. తరువాత దానిని మీ చర్మంపై అప్లై చేయాలి. ఒక 15 నిమిషాలు ఆరనిచ్చి.. ఆపై దానిని బాగా కడగాలి. ఈ టిప్ చాలామంది ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. ఫలితాలు కూడా బాగా ఉంటాయి.ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనెతో తాజా నిమ్మరసం బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ చర్మానికి అప్లై చేసి.. ఒక 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో లేదా చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ఈ సమస్య ఈజీగా తొలగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: