ఆగకుండా 50 కి.మి. వెళ్లే సైకిల్.. వివరాలు..

Purushottham Vinay
ఇక ఇండియాలో  పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు సంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ ఇంధనాలతో నడిచే వాహనాల కోసం చూస్తున్నారు. ఇక ఇందులో, భాగంగానే ఇప్పుడు అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి బాగా మళ్లింది.ఇక ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవే కాకుండా ఇంకా ఆర్థికంగా కూడా ప్రజలకు ఎంతో మేలైనవి.ఇక ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే మార్కెట్లోకి అనేక కొత్త కార్లు ఇంకా టూవీలర్ బైక్ ల కంపెనీలు ప్రవేశించాయి. అయితే, కొందరు టాలెంటెడ్ వ్యక్తులు మాత్రం తామే స్వయంగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేసుకుంటున్నారు.ఇక తాజాగా అలాంటి సంఘటనే ఇప్పుడు తమిళనాడులో చోటు చేసుకోవడం జరిగింది. తమిళనాడుకి చెందిన ఈ వ్యక్తి తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 50 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని అతను చెబుతున్నాడు.ఇక పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోండి.


ఇక తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎస్ భాస్కరన్ అనే 33 సంవత్సరాల వ్యక్తి కేవలం రూ.20,000 ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసినట్లు చెప్పడం జరిగింది. ఇక ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించడానికి ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపడం జరిగింది.ఇక భాస్కరన్ ఈ సరికొత్త ప్రయోగం కోసం ఓ సాధారణ సైకిల్‌ను తీసుకొని దానిని మార్కెట్లో దొరికే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి ఈ సైకిల్‌ను ఈ-సైకిల్‌గా మార్చేయడం జరిగింది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొందిన భాస్కరన్ తన తెలివినంతా వాడి ఇలా ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించడం జరిగింది.ఇక గత సంవత్సరం భారతదేశంలోకి ప్రవేశించిన కోవిడ్-19 మహమ్మారి కారణంగా భాస్కరన్ తన ప్రైవేటు ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. తన ఉద్యోగం పోయినా కాని తాను మాత్రం ఏమాత్రం కుంగిపోకుండా వ్యవసాయంపై దృష్టి సారించాడు. తన ఖాళీ సమయంలో అతను ఊరికే కూర్చోకుండా ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ తయారిపై పనిచేయటం ప్రారంభించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: