ధరలు పెంచిన హీరో బైక్స్...

Purushottham Vinay
హీరో మోటార్ బైక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ బైక్స్ గా ఇవి ఎంతో ఆదరణ సంపాదించాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు వీటిని ఎక్కువగా కొంటూ వుంటారు.ఇండియా మార్కెట్లో అతి పెద్ద బైక్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఈ హీరో మోటోకార్ప్ ఇటీవల తన బ్రాండ్  బైకులుఇంకా స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.ఈ బైక్స్ ధరల పెరుగుదల 2021 జులై 01 నుంచి అమల్లోకి రానుంది. దీనికి కారణం కంపెనీ ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహనాల తయారీ ఖర్చు కూడా పెరిగిందని అదే అసలైన కారణం అని కంపెనీ తెలిపింది.

ఈ పరిస్థితిలో కంపెనీ వాహనాల ధరలను పెంచడం ద్వారా కంపెనీ అధిక ధరల భారాన్ని తగ్గించబడాలసింది ఇక ధరల పెరుగుదల తర్వాత కూడా వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా కంపెనీ జాగ్రత్త తీసుకోవడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు కూడా కంపెనీ తెలిపింది.ఇక హీరో కంపెనీ నివేదికల ప్రకారం తెలిసిందేంటంటే 2021 జూలై 1 నుంచి తన ద్విచక్ర వాహనాల ధరలు రూ. 3,000 వరకు పెంచుతుంది. ఈ ధరల పెరుగుదల కూడా మోడల్ అలాగే వేరియంట్ ఆధారంగా ఉంటుందిని కంపెనీ తెలిపింది.అలాగే ఈ సంవత్సరం హీరో కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం వరుసగా ఇది మూడవసారి కావడం విశేషం.హీరో కంపెనీ ఈ ఏడాది జనవరి ఇంకా ఏప్రిల్ నెలల్లో ధరలను పెంచిన విషయం అందరకి తెలిసిందే.

ఇక హీరో మోటోకార్ప్  అమ్మకాల విషయానికి వస్తే, హీరో కంపెనీ గత నెలలో అంటే 2021 మే నెలలో మొత్తం 1,83,044 యూనిట్లను అమ్మినట్లు తెలిపింది. అదే విధంగా 2020 మే నెలలోని అమ్మకాలు మొత్తం 1,12,682 యూనిట్లు.అలాగే ఏప్రిల్ 2021 తో పోల్చితే మే 2021 లో హీరో కంపెనీ తక్కువ అమ్మకాలు జరిపినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: