ప్రస్తుతం ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యత్తమ మోడల్ ఏదంటే..అది ఖచ్చితంగా ఎక్కువ మంది చెప్పే పేరు టాటా నెక్సాన్.ఎస్యూవీ కార్ విభాగంలో ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చిన మోడల్ టాటా నెక్సాన్. ఒకప్పుడు టాటా సుమో, టాటా సఫారీ ఎస్యూవీలు ఎంతగా ఈ బ్రాండ్కు పాపులారిటీని తెచ్చిపెట్టాయో, ఇప్పుడు నెక్సాన్ కూడా అంతే పాపులారిటీని తెచ్చిపెడుతోంది.టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ తొలిసారిగా 2017లో భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఐదేళ్ల కాలంలో కంపెనీ ఇప్పటి వరకూ 4 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. తాజాగా, టాటా మోటార్స్ ఫ్యాక్టరీలో తయారైన 4,00,000వ యూనిట్ టాటా నెక్సాన్ ఎస్యూవీని కంపెనీ బయటకు విడుదల చేసింది. ఈ సందర్భంగా, టాటా నెక్సాన్లో కంపెనీ ఓ కొత్త వేరియంట్ను కుడా విడుదల చేసింది. రానున్న పండుగ సీజన్లో ఈ కొత్త వేరియంట్ మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలదని కంపెనీ భావిస్తోంది.టాటా నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ (ఎల్) పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్ను రిలీజ్ చేసింది. మార్కెట్లో కొత్త Tata Nexon XZ+(L) వేరియంట్ ధర రూ.11.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.
ఈ కొత్త వేరియంట్ ను ప్రస్తుత టాటా నెక్సాన్ టాప్-స్పెక్ వేరియంట్ అయిన XZ+ వేరియంట్ కు ఎగువన ఉంచబడింది. కొత్త XZ+ (L) వేరియంట్ పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్బాక్స్లతో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ కొత్త వేరియంట్ స్పెషల్ డార్క్ ఎడిషన్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది.టాటా మోటార్స్ తమ నెక్సాన్ ప్రోడక్ట్ లైనప్ లో కొత్తగా జోడించిన ఈ ఎక్స్జెడ్ ప్లస్ (ఎల్) వేరియంట్ లో ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఇంకా లెథెరెట్ అప్హోలెస్ట్రీతో కూడిన వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి కొత్త ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇది నెక్సాన్ టాప్-స్పెక్ వేరియంట్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇందులో 7 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, కూల్డ్ గ్లోవ్బాక్స్, రియర్ ఏసి వెంట్స్ ఇంకా అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.